నాగేశ్వర్‌ రావు ట్వీట్‌కు కేటీఆర్‌ రీట్వీట్‌

104
ktr
- Advertisement -


నీతి ఆయోగ్ స‌మావేశానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రై ప్ర‌ధానిని ప్ర‌శ్నించాల్సి ఉండాల్సింద‌ని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వ‌ర్ రావు చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

మ‌హాభార‌తంలో సంధి కుద‌ర‌ద‌ని తెలిసి కూడా శ్రీకృష్ణుడు రాయ‌బారానికి వెళ్లిన ఘ‌ట‌న నుంచి కేసీఆర్ జ్ఞానం పొంది ఉండాలి. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రులు హాజ‌ర‌య్యే నీతి ఆయోగ్ స‌మావేశానికి సీఎం హాజ‌రై ప్ర‌శ్నించి ఉండాల్సింద‌ని నాగేశ్వ‌ర్ రావు అన్నారు.

అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు అనేది పాత సామెత అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప‌క్ష‌పాత‌, వివ‌క్ష పూరిత‌మైన మ‌న‌స్త‌త్వంతో గ‌తంలో నీతి ఆయోగ్ సిఫార్సుల‌ను బుట్ట‌దాఖ‌లు చేసింద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. నేతి బీర‌కాయ‌లో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్‌లో నీతి కూడా అంతే ఉంద‌న్నారు కేటీఆర్. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -