బడ్జెట్‌లో కార్పోరేషన్లకు ప్రత్యేక నిధులు

213
KTR promises all-round development in Corporations
- Advertisement -

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్ కమిషనర్లు,అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  కార్పోరేషన్ల కమీషనర్లతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేటీఆర్ తెలంగాణలోని అన్ని కార్పోరేషన్లలో  ప్రజలకు అవసరం అయినరోడ్లు, మార్కెట్లు, టాయిలెట్లు, పార్కులు,బస్ బేలు, బస్ షెల్టర్లు,శ్మశాన వాటికల వంటి కనీస వసతుల కల్పనపైన దృష్టి సారించాలని సూచించారు. బడ్జెట్‌లో కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు.

ప్రతి కార్పోరేషన్ పట్టణ  విజన్ తయారు చేయాలని, ఈ విజన్ మేరకు దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాని మంత్రి అధికారులను కోరారు. ముఖ్యమంత్రి మున్సిపాలిటీలు, కార్పేరేషన్లపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారన్న కేటీఆర్ … సీఎం ఆలోచనల  మేరకు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం పట్టణంలో రోడ్ల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు  చేపట్టాలన్నారు. రోడ్డు సౌకర్యాలతోపాటు పట్టణాల్లో బస్ బేలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్ధల భూమిని ఎలాంటి నోటీసు లేకుండా వినియోగించుకునేందుకు గతంలో ఇచ్చిన సర్య్కూలర్ ఉపయోగించుకుని బస్‌ బేల నిర్మాణం చేపట్టాలన్నారు.

KTR promises all-round development in Corporations

ఈ బస్ బేలు, షెల్టర్లు సాద్యమైనంత అత్యాధునికంగా ఉండేలా ప్రయత్నించాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పుడే పుట్ పాత్ ల నిర్మానం చేపట్టలన్నారు.  పట్టణాల్లోని జనాభాకు అనుగుణంగా టాయిలెట్స్  నిర్మాణం జరగాలన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్ తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. రొడ్ల పైన మూత్ర విసర్జనను అరికట్టేలా టాయిలెట్స్‌కు దారి, దూరం వంటి వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలనుఒపెన్ ఢీపెకేషన్ ప్రీ చేసేందుకు ఉగాదిలోగా పెట్టుకున్న గడువు మేరకు పనిచేయాలన్నారు. ఈమేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైన దృష్టి సారిస్తూ మిషన్ మోడ్ లో పనిచేయాలన్నారు.

పట్టణాల్లో శ్మశాన వాటికలను అభివృద్ది చేయాలన్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని మహప్రస్థానం  స్థాయిలో ఉండాలన్నారు. పట్టణాల్లో డబుల్ బెడ్ రూం కార్యక్రమాలను  కలెక్టర్లతో కలసి సమన్వయం చేసుకోవాలన్నారు. పట్టణాల్లోని జనభా అవసరాల మేరకు మాడల్ మార్కెట్ల నిర్మాణం చేపట్టలన్నారు. కూరగాయాలకు(వెజ్), నాన్ వెజ్‌కు ప్రత్యేకంగా  మార్కెట్లు నిర్మాణం చేయాలన్నారు. మెకనైజ్డ్ కబేలాలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్యం కోసం కార్పోరేషన్లకు వాహనాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. పారిశుధ్ద్య నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. కమీషనర్లు ఉదయం 5 గంటలకే పారిశద్ద్య పనులను సమీక్షించాలన్నారు. పట్టణాల్లో అనధికారిక ప్లెక్సీలు, వాల్ రైటింగ్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. కేసులు నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అదేశించించారు.

KTR promises all-round development in Corporations

పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ఈ లైట్ల బిగింపు పక్రియను జరుగుతున్న తీరుని మంత్రి సమీక్షించారు. మరో మూడు కార్పోరేషన్లతో ఐదు రూపాయాల భోజన పథకాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు అయా కార్పోరేషన్లలోని ప్రాంతాలను గుర్తించాలన్నారు.  కార్పోరేషన్ల ఔట్ సొర్సింగ్,కాంట్రాక్ట్ సిబ్బంది మేయర్లు, కార్పోరేటర్లు, ఇతర అధికారుల వద్ద పనిచేస్తున్న విషయం పలువురు సోషల్ మీడియాలో ప్రస్తావించిన విషయంపైన మంత్రి కమీషనర్లను హెచ్చిరించారు. పురపాలికల నుంచి జీతం తీసుకునే ప్రతి ఉద్యోగి సంస్ధ కోసమే పనిచేయాలన్నారు. ఇలాంటి విషయంలో పిర్యాదు వస్తే కమీషనర్లపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

- Advertisement -