చిరుతో సై అంటున్న అలనాటి తారలు..

350
- Advertisement -

దాదాపు పది సంవత్సరల తర్వాత టాలీవుడ్‌కి, ఎంటర్‌టైన్‌ మెంట్‌కి దూరంగా ఉన్న మాట మూమ్మటికి వాస్తవం. మళ్లీ సినిమా చెయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆడియెన్స రియాక్షన్‌ ఎలా ఉంటుంది. నన్నెలా ఎలా రిసీవ్‌ చేసుకుంటారు. గతంలో ఉన్న చూపిన ప్రేమాభిమానాలు ఇప్పుడు చూపిస్తారా? అని నాకు అనుమానం ఉండేది. నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘ఖైదీ నంబర్‌ 150’ను ప్రేక్షకులు ఆదరించిన తీరు, ఆప్యాయతను ఎప్పటికీ మరచిపోలేను’’ అని చిరంజీవి అన్నారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరలో కూడా అరంగేట్రం చేసేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న మెగాస్టార్ హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. కోట్లాదిమంది మెచ్చే వెండితెర మెగాస్టార్.. ఇప్పుడు బుల్లితెరపై తను ఆడుతూ.. కంటెస్టెంట్లతో ఆడిస్తుంటే.. చూసేందుకు ప్రేక్షకులకు రెండు కళ్లు చాలలేదు. ఈ షో గురించిన ఇంట్రడక్షన్ తో పాటు.. మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను కూడా షేర్ సుకున్నారు మెగాస్టార్.

 9525_Meelo-Evaru-Koteeswarudu

ఈ షోలో కొన్ని ఎపిసోడ్‌లకు అతిథులుగా నాగార్జున, వెంకటేశ, రాధిక, సుహాసిని వంటి వాళ్లు వస్తున్నారని మెగాస్టార్‌ తెలిపారు. ‘‘మిత్రుడు బాలకృష్ణను కూడా అతిథిగా ఆహ్వానిస్తా. ఆ మధ్య నా పుట్టినరోజు వేడుకలో నేను, బాలకృష్ణ, సల్మాన్‌ఖాన్ ఉర్రూతలూగించే పాటకు స్టెప్పులేశాం’’ అని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

వీటిలో తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి.. రాధిక.. సుహాసినిలు కలిసి ఒకే ఫోటో దర్శనం ఇచ్చిన ఈ పోజ్ అందరినీ అబ్బురపరుస్తోంది. ఒకవైపు రాధిక.. మరోవైపు సుహాసిని.. ఇద్దరూ మెగాస్టార్ కు చెరోవైపు కూర్చుని.. చెరో చెయ్యి పట్టుకుని ఇచ్చిన పోజ్ అదిరిపోయింది. అందరి మొహాల్లోనూ కనిపిస్తున్న చిరునవ్వు ఈ ఫోటోకు అసలు సిసలైన హైలైట్. తన మాజీ హీరోయిన్లతో మెగాస్టార్ ఇచ్చిన పోజ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోలో భాగంగా మహిళా దినోత్సవం(మార్చ్ 8) రోజున.. ఈ ఇద్దరు సీనియర్ బ్యూటీలతో ఆడించనున్నారు చిరు. ఆ ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా తీసిన ఈ ఫోటో.. చూడముచ్చటగా ఉంది కదూ!

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో మా ఛానల్‌ లోగో ‘స్టార్‌ మా లోగో’ గా మారనుంది. ప్రతి సోమవారం నుండి గురువారం వరకు రోజు రాత్రి 9.30 గంటలకు‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది.ఇక నుంచి మెగాస్టార్‌ చిరంజీవి బుల్లితెరపై దర్శనమివ్వనున్నారు.

- Advertisement -