మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: కేటీఆర్

167
minister ktr
- Advertisement -

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్‌లో బస్తీ దవాఖానాను స్ధానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు కేటీఆర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బ‌స్తీ ద‌వాఖానాల్లో డ‌యాగ్నోస్టిక్ సేవ‌లు కూడా అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇప్ప‌టికే 224 బ‌స్తీ ద‌వ‌ఖానాలు ప్రారంభించామని…మరో 125 బ‌స్తీ ద‌వ‌ఖానాల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. బ‌స్తీ ద‌వాఖానాల ద్వారా పేదల‌కు మెరుగైన వైద్యం అందుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -