అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…

289
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన #GiftASmile పిలుపుకు స్పందించిన పలువురు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఈ అంబులెన్స్ లను శనివారం ప్రగతి భవన్ లో మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు.

అంబులెన్స్ లు ఇచ్చిన వారి వివరాలు :

మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 2
మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ – 1
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెక పూడి గాందీ – 1
పరిగి ఎమ్మెల్యే శ్రీ మహేష్ రెడ్డి – 1
దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి – 1
అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు – 1
ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి – 1

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి ,శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు శ్రీ మహేష్ రెడ్డి, శ్రీ అరెక పూడి గాందీ, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -