ఆర్టీసీ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం..

288
KTR Fire on RTC
- Advertisement -

తెలంగాణా ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమా వేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సులో నాని హీరోగా ఇటీవలే విడుదలైన కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ పైరసీ కాపీని ప్రసారం చేస్తున్నారని ఓ ప్రయాణికుడు కేటీఆర్‌కు ట్వీటర్ ద్వారా సందేశం పంపాడు. ప్రభుత్వ సంస్థల్లోనే ఇలాంటి పైరసీ జరిగితే.. ఇక పైరసీ నియంత్రించాలని సామ్యానుడిని ఎలా అడుగుతారని ఆ ప్రయానికుడు ప్రశ్నించాడు.

సునీల్ అనే ప్రయానికుడి ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు. నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వారం రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం వైపుగా దూసుకెళుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించారు.

- Advertisement -