అన్నిరంగాల్లో సనత్ నగర్ అభివృద్ధి: మంత్రి కేటీఆర్

175
ktr
- Advertisement -

స‌న‌త్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని తెలిపారు మంత్రి కేటీఆర్‌. సనత్ నగర్‌ పరిధిలో బల్కంపేట్‌లో రూ. 3.60కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని, ఫ‌తేన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ స‌మీపంలో 2.45 ఎక‌రాల విస్తీర్ణంలో వైకుంఠ‌ధామంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….రాష్ర్టంలో ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని ఆద‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే చేప‌ట్టాం అని గుర్తు చేశారు.హైద‌రాబాద్‌లో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

స‌న‌త్‌న‌గ‌ర్‌లో వైకుంఠ‌ధామం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లింక్ రోడ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందించాల‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ విధంగా హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అన్నారు.

- Advertisement -