దేశంలో 87 లక్షలు దాటిన కరోనా కేసులు..

198
covid
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 లక్షలు దాటాయి. గత 24 గంట‌ల్లో 44,878 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 547 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 87,28,795కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,84,547 యాక్టివ్ కేసులుండగా 1,28,688 మంది మృతిచెందారు. 81,15,580 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల్లో 49,079 మంది డిశ్చార్జీ అయ్యార‌ని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 92.97 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.47 శాతంగా ఉంది. న‌వంబ‌ర్ 12 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 12,31,01,739 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -