మొక్కలు నాటిన అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసర్‌

44
- Advertisement -

బీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్రీ అదనపు కమీషనర్ కృష్ణ మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా మాసబ్ ట్యాంక్‌ చాచా నెహ్రూ పార్క్‌లో మొక్కలు నాటారు.

Also Read: రేపే గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష…

ఈ సందర్భంగా మాట్లాడుతూ…గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read: అమెజాన్‌: 40రోజులు.. చిన్నారులు సురక్షితం

- Advertisement -