కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి..

251
kosuri venugopal
- Advertisement -

ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ ఇకలేరు. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ పరిస్ధితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరోనా బారీన పడిన ఆయన 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్‌ తదితర సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ కనిపించారు. చివరిగా ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో కనిపించారు.

- Advertisement -