దిగ్విజయ్ సింగ్‌కి కొండా లేఖ..

54
- Advertisement -

మరోసారి లేఖాస్త్రం సంధించారు మాజీ మంత్రి కొండా సురేఖ. ఇటీవలె తనకు కేటాయించిన పదవిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు సురేఖ. తన రాజీనామా లేఖను స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి అందించారు.

ఇక తాజాగా దిగ్విజయ్ సింగ్‌కు లేఖ రాశారు కొండా సురేఖ. 27 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

రాజకీయాల్లో తనకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉందని.. తాను 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానని 27 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని పేర్కొన్నారు. తన భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు గుర్తు చేశారు. తామిద్దరం వెనుబడిన తరగతుల నుంచి వచ్చి..తెలంగాణతో పాటు..ఏపీ రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -