రాష్ట్రపతికి ఘనస్వాగతం..

74
- Advertisement -

శీతాకాల విడిదికోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై,మంత్రి సత్యవతి రాథోడ్‌లు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ముర్ము 5 రోజులు బస చేయనున్నారు.

హైదరాబాద్ నుంచి ముర్ము శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. 12 గంటలకు శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. స్వామి వారికి పంచమూర్త అభిషేకం నిర్వహిస్తారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భక్తులకు ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు.
అనంతరం చెంచు ట్రైబల్స్ తో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్ లో హకీంపేట్ ఎయిర్ బేస్ కు చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -