ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారడం లేదు..కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

31
- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ మార్పులపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మేం 6 కోట్లే ఇస్తున్నాం, అందుకే ఎమ్మెల్యేల పార్టీ మారడం లేదని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు.

దీంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు కొంటున్నారు అనే విధంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఉండటంతో ఆ పార్టీ నేతలు చిక్కుల్లో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అని పరోక్షంగా కోమటిరెడ్డి చెప్పడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఆనాడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదనే వాదన వినిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజలు కూడా పార్టీ ఫిరాయింపులను హర్షించడం లేదు. ఇక ఇప్పటివరకు కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెలిసిందే.

Also Read:TTD:జనతా క్యాంటీన్లపై ఈవో ప్రత్యేక దృష్టి

- Advertisement -