కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

180
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తల్లిగారు భానుమతి గారు గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఈ రోజు భానుమతి గారి ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో కీరవాణి కుటుంబం శోఖ సంద్రంలో మునిగిపోయింది. కీరవాణి తల్లి గారు మరణించిండం నిజంగా బాధాకరమైన విషయం. గత కొన్నిరోజులుగా వయో వృద్ధ సమస్యలతో భానుమతి గారు బాధపడుతున్నారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. కీరవాణి తల్లి మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. కీరవాణి గారు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అద్భుతమైన సంగీతాన్ని అందించారు అంటే.. కారణం భానుమతి గారే.ఆమె కీరవాణికు చిన్న తనం నుంచి సంగీతాన్ని నేర్చుకోవడానికి ప్రోత్సహించారు. అలాంటి ఆమె తుదిశ్వాస విడవడం కీరవాణి సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. రేపు ఉదయం భానుమతి గారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మా గ్రేట్ తెలంగాణ. కామ్ తరపున భానుమతి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

ఇవి కూడా చదవండి…

మీమ్స్‌ వైరల్‌…పవన్, లక్ష్మీ

షారుఖ్‌కు షాక్‌…పఠాన్ బ్యాన్‌ నిజమెంత

ఎన్టీఆర్ కి తల్లిగా విజయశాంతి

- Advertisement -