స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఐతే, ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి బయటకు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఈ పాత్ర కోసం కొరటాల శివ, సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతిని తీసుకుంటున్నారట. కొరటాల శివ ఇప్పటికే విజయశాంతిని కూడా సంప్రదించాడట. క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండటంతో విజయశాంతి కూడా, జూనియర్ ఎన్టీఆర్ కి తల్లిగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కోసం విజయశాంతిని కొరటాల ఫిక్స్ చేశాడు. పైగా ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. అందుకే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించబోతుంది. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కలిసి నటిస్తే.. ఆ స్క్రీన్ విజువల్స్ అదిరిపోతాయి. పైగా జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కూడా హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు.
కాబట్టి.. జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్.. సో.. ఈ ఇద్దరికి తోడు విజయశాంతి. మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా, ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఆ బజ్ కి తగ్గట్టుగానే ఖర్చు కూడా పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓ హాలీవుడ్ యాక్షన్ కొరియగ్రాఫర్ ను తీసుకోబోతున్నారు. అన్నిటికీ మించి ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం యావత్తు భారతీయ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవి కూడా చదవండి…
2022…బాలీవుడ్ లేడీ మూవీస్
వైరల్ : రాజమౌళి కి ప్రభాస్ కంగ్రాట్స్
డ్రైవర్ నుంచి గొప్ప డైరెక్టర్ వరకూ