మెగాస్టార్‌తో మూవీ…రెమ్యునరేషన్‌ పెంచేసిన కీర్తి!

117
- Advertisement -

మహానటి తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది కీర్తి సురేష్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి…ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. దాదాపు రూ. 3 కోట్లు డిమాండ్ చేయగా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం కీర్తి ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కూడా కేటాయించిందట. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం “వేదాళం” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు టాలీవుడ్ లో మెగాస్టార్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.

- Advertisement -