తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు రేపు (మే 12, మంగళవారం) పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడం….కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం మరియు పాత సభ్యత్వాలను పునరుద్ధరించడం వంటి అంశాలను వివరించనున్నారు.
ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు మరియు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జిలను నియమించడం ద్వారా పార్టీలో జవసత్వాలు నింపడం…ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు మరియు కీలక నేతలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మరియు సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం.
Also Read:ఓటీటీ ట్రెండింగ్లో ‘డెకాయిట్’

