నూతన అసెంబ్లీకి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

427
cm kcr new assembly
- Advertisement -

ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు సీఎం కేసీఆర్‌. స్పీకర్‌ పోచారంతో పాటు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

17.9 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాలను నిర్మించనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం నిజాం కాలం నాటిది కావడంతో ఇప్పటి అవసరాలకు తగ్గట్లుగా కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా వివిధ ప్రాంతాలను పరిశీలించి.. ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ సముదాయాన్ని ఎంపిక చేశారు. అక్కడ రూ.100 కోట్లతో శాసనసభ, మండలి, సెంట్రల్‌ హాల్‌లను నిర్మిస్తారు.

అంతకముందు తెలంగాణ నూతన సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. వాస్తు దోషం లేకుండా అన్ని హంగులతో రూ.400 కోట్ల వ్యయంతో సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం 25 ఎకరాల్లో ఉన్న సచివాలయాన్ని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు.

- Advertisement -