అక్టోబర్‌లో కార్తికేయ 2 ప్రారంభం..

475
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. చాలా రోజులుగా కార్తికేయ 2 గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన కార్తికేయ చిత్రం నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఉత్కంఠ భరితంగా సాగే కథ, కథనాలతో దర్శకుడు చందు ముండేటి మ్యాజిక్ చేశాడు. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ – నిఖిల్ రంగంలోకి దిగారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ – వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు.

karthikeya

ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ‘శ్రుతి శెట్టి’ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదనేది తాజా సమాచారం. కథానాయిక ఎవరనేది త్వరలోనే తెలియజేస్తారట. కొంతకాలంగా సక్సెస్ కి దూరమైన చందూ – నిఖిల్ ఇద్దరూ కూడా ‘కార్తికేయ 2’తో మళ్లీ హిట్ కొడతారేమో చూడాలి.

- Advertisement -