40 వేల మెజార్టీతో గెలుస్తున్నాం: కర్నె ప్రభాకర్

487
karne prabhakar
- Advertisement -

హుజుర్‌నగర్‌లో 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. నెరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్,చిరుమర్తి లింగయ్య,భాస్కరరావు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల ఛైర్మెన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

హుజుర్‌నగర్‌ ప్రజల అదృష్టి కొద్ది ఈ ఉప ఎన్నికలు వచ్చాయని తెలిపారు కర్నె ప్రభాకర్. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పక్కా లోకల్..40 వేల తో భారీ మెజారిటీతో గెలుస్తున్నాం…ఉత్తమ్‌కు పదవులు తప్ప ప్రజాసమస్యలు పట్టవన్నారు.ఈ ఎన్నికలతో ఉత్తమ్ పీడ హుజుర్‌నగర్ ప్రజలకు లేకుండా పోతుందన్నారు.

హుజుర్‌నగర్ లో పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించామన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడ చూసినా ప్రజలు ఉత్సహంగా గులాబీ జెండా పట్టుకొని వెంట నడుస్తున్నారని…అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికాల్వలో వేసినట్లే అన్నారు.

- Advertisement -