అభివృద్ధికి ఓటేయండి: నన్నపనేని నరేందర్

548
mla narender
- Advertisement -

ఈ ఎన్నికలు హుజుర్‌నగర్‌లో అభివృద్ధికి… అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నెరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌ పార్టీదే అన్నారు. చాలా సమన్వయంతో పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని తెలిపారు.

ఉత్తమ్ నాయకులనే కలవడు..ఇక ప్రజలను ఏం కలుస్తాడని మండిపడ్డారు ఎమ్మెల్యే భాస్కర రావు. ఈ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి కి పట్టం కట్టాలని హుజుర్‌ నగర్ ప్రజలను కోరారు.

హుజుర్‌ నగర్ ఎన్నికల్లో దళిత బిడ్డలంతా టీఆర్ఎస్‌కి ఓటేయ్యాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలను కోరారు. ఉత్తమ్ కి గుణపాఠం చెప్పాలి……గ్రామాల్లో ప్రచారానికి పోతుంటే ప్రజలు అక్కున చేర్చుకొని స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.

- Advertisement -