నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే ఆరాష్ట్రంలోకి ఎంట్రీ..!

149
cs
- Advertisement -

కరోనా కట్టడిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారు నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని సీఎస్ పి రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బస్సు, ట్రైన్, ఫ్లైట్.. ఏ మార్గంలో వచ్చినా ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ 72 గంటల లోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ మాత్రమే అయ్యి ఉండాలని వెల్లడించారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో డెల్టా ప్లస్ కేసులు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన కలబుర్గి, బెలగావి, విజయపుర, బీదర్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు, హెల్త్ వర్కర్స్, రెండేండ్ల లోపు వయసున్న పిల్లలకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని చెప్పారు. కుటుంబసభ్యుల అంత్యక్రియలకు వెళ్లే సామాన్యులకు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లను చెక్ పోస్టుల్లో అపొద్దని, కరోనా నెగెటివ్ రిపోర్ట్ కానీ, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ లేకపోయినా అనుమతించాలని సూచించారు.

- Advertisement -