జూలై 31 వరకు అంతర్జాతియ విమానాలపై నిషేధం..

184
dcga
- Advertisement -

మరోసారి అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని పొడగించింది కేంద్రం. జూలై 31 వరకు అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించని స్పష్టం చేసింది.

గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్‌, ప్యాసింజర్‌ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారికోసం వందే భరత్ మిషన్‌ ద్వారా స్వదేశాలకు ప్రయాణీకులను తీసుకువచ్చింది. తర్వాత పలు దేశాలతో ఎయిర్‌ బబుల్‌ కింద అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఒప్పందాలు చేసుకుంది భారత్.

- Advertisement -