హనీ ట్రాప్ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదలిపెట్టమని స్పష్టం చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం అయితే హనీట్రాప్లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని.. చట్టప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి.పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు.
కనీసం 48 మంది హనీ ట్రాప్లో బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు. సీడీలు, పెన్డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయని… ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు.
Also Read:Telangana: వాతావరణశాఖ తీపికబురు