మాజీ ఎంపీ కవిత పెద్దమనసు…

236
kavitha
- Advertisement -

మాజీ ఎంపీ కవిత మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని‌ స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి అపన్నహస్తం అందించారు.

వినయ్‌ ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్న మాజీ ఎంపీ కవిత అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లో కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా వినయ్ కుటుంబ సభ్యులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

కోరుట్ల పట్టణానికి చెందిన బోగ వినయ్ 2014లో హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.‌ స్వగ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించగా రూ.18 లక్షల వరకు ఖర్చుకాగా అప్పటినుండి ఇంటికే పరిమితమయ్యాడు.

- Advertisement -