మధ్యవర్తిత్వంతో ప్రజలకు మేలు: జస్టిస్ ఎన్వీ రమణ

211
ramana
- Advertisement -

మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. ఇండియా – సింగపూర్ మీడియేషన్ సమ్మిట్‌లో మాట్లాడిన రమణ… వివాద ప‌రిష్కారాల్లో రాజ్యాంగ స‌మాన‌త్వం ఉండాల‌న్నారు. మ‌ధ్య‌వ‌ర్తుల‌కు శిక్ష‌ణ ఇస్తే సాధార‌ణ ప్ర‌జానీకానికి మేలు జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌త్యామ్నాయ వివాద ప‌రిష్కార వేదిక‌లు ఏర్పాటు చేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ర్టాలు కూడా అమ‌లు చేయాల‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సూచించారు.

మ‌ధ్య‌వ‌ర్తిత్వం త‌క్కువ ఖ‌ర్చుతో కూడుకుందని..అయితే మ‌ధ్య‌వ‌ర్తులు స‌ల‌హాదారుడిగా మార‌డం మంచిది కాదన్నారు. కొన్ని ప‌రిస్థితుల్లో మ‌ధ్య‌వ‌ర్తుల‌కు నైతిక అనిశ్చితి ఉంటుంది….మ‌ధ్య‌వ‌ర్తులు మంచి గుణం, నైతిక‌త, పార‌ద‌ర్శ‌క‌త‌, త‌ట‌స్థ‌త‌ క‌లిగి ఉండాలన్నారు.

- Advertisement -