జేఈఈ పరీక్షల విధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

208
JEE
- Advertisement -

జేఈఈ పరీక్షల విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం కింది ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రాంతీయ భాషల్లో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు. పీఐఎస్ఏ పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకుంటున్న దేశాలు బోధనా మాధ్యమంగా మాతృభాషను ఉపయోగిస్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారని… ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు.

మాతృభాషలో పరీక్షను నిర్వహిస్తే… ప్రశ్నను అవగాహన చేసుకోవడం విద్యార్థులకు సులభమవుతుందని, మెరుగైన మార్కులు సాధించేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. తాము ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని… ఏ రాష్ట్రంపైనా, ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం తాము చేయబోమని చెప్పారు. 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -