సాగర్‌ బరిలో జానా కుమారుడు..!

170
jana
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుండి ఇప్పటివరకు సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉంటారని అంతా ఉహించారు…ఆయన కూడా గతంలో అదే స్టాండ్‌పై ఉన్నారు. అయితే తాజాగా జానా మనసు మార్చుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. అంతేగాదు త్వరలో జరిగే సాగర్ ఉప ఎన్నికల్లో అనుచరులు పోటీ చేసినా లేదా వారంత తన కుమారుడు రఘువీర్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని బలపర్చిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు.

హాలియాలో డిగ్రీ కాలేజ్ కంటే ముందు హాలియలో జూనియర్ కాలేజ్ తోపాటు ఐటిఐ కాలేజ్ ఏర్పాటు చేశామని, చలకుర్తిలో నవోదయ స్కూల్ తెచ్చింది కూడా మేమేనని గుర్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని జానారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -