మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్..

162
gandhi cm kcr
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను స్మరించుకున్న సీఎం…ప్రార్థ‌న‌, అభ్య‌ర్థ‌న‌, నిర‌స‌న అనే ఆయుధాల‌తో ప్ర‌పంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మ‌హాత్మా గాంధీ ఆద‌ర్శ‌ప్రాయుడ‌ని అన్నారు.

ఎప్ప‌టికైనా స‌త్యానిదే అంతిమ విజ‌య‌మ‌ని గాంధీ జీవితం చాటి చెప్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. మ‌హ్మాత్మా గాంధీ అహింస‌, స‌త్యాగ్ర‌హ దీక్ష‌ల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉర‌క‌లెత్తించార‌ని కీర్తించారు. దేశం కోసం త‌న జీవితాన్నే త్యాగం చేసిన మ‌హాత్మాగాంధీ వ‌ర్ధంతిని అమ‌ర‌వీరుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

- Advertisement -