టీఎస్‌పీఎస్సీ సభ్యుల ప్రమాణస్వీకారం…

264
tspsc
- Advertisement -

నూతనంగా నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వీరికి టీఎస్‌పీఎస్సీ సిబ్బందితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నసీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కారం రవీందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ, రిటైర్డ్‌ ఈఎన్సీ రమావత్‌ ధన్‌ సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్‌ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.

- Advertisement -