వైయ‌స్సార్ యాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు..

250
ysr yathra, jagapathi babu
- Advertisement -

ప్ర‌స్తుతం బాలీవుడ్ టూ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తుంది. మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితచ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. యాత్ర అనే టైటిల్ తో ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీకి ఆనందో బ్ర‌హ్మా సినిమా ద‌ర్శ‌కుడు మ‌హి వి. రాఘ‌వ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వైయ‌స్సార్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. 70ఎం ఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చ‌ల్ల‌, శ‌శి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు.

yatra

ఇక ఈసినిమాలో న‌టించే ప‌లువురు న‌టిన‌టుల పేర్లు ఫిలిం న‌గ‌ర్లో చ‌క్కర్లు కొడుతున్నాయి. తాజాగా వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం వైయ‌స్సార్ బ‌యోపిక్ లో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. వైయ‌స్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇందుకుగాను యాత్ర చిత్ర బృందం జ‌గ‌ప‌తిబాబును సంప్ర‌దించార‌ని తెలుస్తుంది. వైయ‌స్సార్ జీవితంలో త‌న తండ్రి పాత్ర‌ను కీల‌కంగా చూపించ‌నున్నారు. ఇందుకు జ‌గ‌ప‌తిబాబు కూడా ఒకే చెప్పిన‌ట్టు స‌మాచారం. వైయ‌స్సార్ తండ్రి రాజారెడ్డి ఒకప్పుడు రాయ‌ల‌సీమ రాజ‌కీయాల‌లో క్రియాశీల‌క పాత్ర పోషించారు.

Mammootty, ysr

వైయ‌స్సార్ జీవితంలో కీల‌క పాత్ర పోషించిన ప‌లువురి పాత్ర‌లు సినిమాలో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇందుకు త‌గ్గ‌ట్టుగా ఈ పాత్ర‌ల‌కు స‌రిపోయేవిధంగా ప‌లువురి న‌టిన‌టుల‌ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. క‌ర్నూలుకు చెందిన ప్ర‌ముఖ మ‌హిళా నాయ‌కురాలి పాత్ర‌లో యాంక‌ర్ అన‌సూయ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే మాజీ హోం మంత్రి స‌బ‌తి ఇంద్రారెడ్డి పాత్ర‌లో సుహాసిఇన‌, ష‌ర్మిళ పాత్ర‌లో భూమిక ఇలా ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్నట్లు స‌మాచారం. తెలుగు , త‌మిళంలో ఈసినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -