సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైసీపీ అధినేత ,మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు . అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేసినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద నోటీసు ఇచ్చారు పోలీసులు.
Also Read;రేపటి డేట్తో పోసానికి నోటీసులు ఇస్తారా?