27 నుండి జగన్ బస్సుయాత్ర..

13
- Advertisement -

ఈ నెల 27 నుండి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 27న ఇడుపుల పాయ నుండి బస్సు యాత్ర ప్రారంభవుతుందని 21 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అనే పేరు ఖరారు చేశామన్నారు.

28న నంద్యాలలో , 30న ఎమ్మిగనూరులో బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. ముందు కార్యకర్తలతో ఇంటరాక్షన్‌, సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతారని చెప్పారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని… పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

Also Read:పార్టీ మారడం లేదు:ఎర్రబెల్లి

- Advertisement -