పార్టీ మారడం లేదు:ఎర్రబెల్లి

18
- Advertisement -

తాను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని..కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సారథ్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తానని తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. కార్యకర్తలు గందరగోళానికి గురి కావొద్దని, అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన దాన్ని ఖండించారు. అయితే ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడు మార్నేని రవీంద్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవీందర్ రావుతో పాటు ఆయన భార్య,ఐనవోలు ఎంపీపీ మధుమతి కాంగ్రెస్‌లో చేరారు.

Also Read:రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -