జగదీష్ రెడ్డి..ఇంటింటి ప్రచారం

6
- Advertisement -

సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఇంటింటా ప్రచారం నిర్వహించి ఆయన..బీఆర్ఎస్‌కు ఓటేయాలని కోరారు.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు.తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్‌ఎస్‌ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని
అన్నారు.

కాంగ్రెస్ అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి నమ్మెందుకు సిద్దంగా లేరని అన్నారు. ప్రచారం సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ పాలన లో తమకు జరిగిన నష్టాల ను,అన్యాయాలపై ప్రజలే మాకు వివరిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో నాగార్జునసాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజ్ లో సైతం నుంచి పంటలను కాపాడామని అన్నారు. ప్రస్తుత పాలనలో మన పంటలను ఎండబెట్టి, తూముల వద్ద పోలీసులను కాపలా పెట్టి, కిందికి తరలించకపోయారని అన్నారు. మే 13న బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -