నీతి,నిజాయితీతో పోటీ చేస్తున్నాం:చంద్రబాబు

7
- Advertisement -

నీతి, నిజాయితీతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి గన్నవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు.

భారీ వర్షం పడుతున్నా వర్షంలోనే ప్రసంగించారు చంద్రబాబు. ల్యాండ్‌ టైటిలింగ్‌ ద్వారా ప్రజల ఆస్తులను జగన్‌ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు.

కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని భరోసా ఇచ్చారు.

Also Read:జొన్నరొట్టెలు తినడం మంచిదేనా?

- Advertisement -