ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హరీష్ పూజలు

9
- Advertisement -

సిద్దిపేట గణేశ్ నగర్‌లోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హనుమాన్ స్వాములతో కలిసి భిక్ష కార్యక్రమంలో పాల్గొనే పుణ్యం దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలేలా చూడాలని స్వామిని ప్రార్థించానని తెలిపారు.

హనుమాన్ నామస్మరణం సర్వపాపహరణం… అంజనేయుని అనుగ్రహం ఉంటే విజయం సిద్ధిస్తుందన్నారు. శ్రీప్రసన్నాంజేయ స్వామి ఆలయ ట్రస్ట్ ప్రతీ ఏటా 2వేల మంది హనుమాన్ మాలధారులకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం అని కొనియాడారు. సిద్దిపేట ఆధ్యాత్మికతను సంతరించుకుని, భక్తితో పరవశించి పోతుందని తెలిపారు.

Also Read:ఈ ఆసనం వేస్తే.. ఆ సమస్యలు దూరం!

- Advertisement -