చలాకి చంటీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన తేజ..

322
naga teja
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు జబర్దస్త్ నాగ తేజ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని నాగ తేజ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. జబర్దస్త్ రాము విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ నాగ తేజ మోతినగర్‌లో మూడు మొక్కలు నాటారు.అనంతరం మరో ముగ్గురు ( చలాకి చంటి, యాంకర్ శ్రావణి, ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ విజయ్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -