మొక్కలు నాటిన కమెడియన్ అంబటి శ్రీనివాస్..

168
Comedian Srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కమెడియన్ అంబటి శ్రీనివాస్ మొక్కలు నాటారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

జబర్దస్త్ రాము విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.అనంతరం మరో ముగ్గురు (కమెడియన్ లు సుమన్ శెట్టి,గుండు సుదర్శన్,సంగీత దర్శకుడు జయసూర్య)లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -