పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాంత్‌ శర్మ..

199
online news portal
- Advertisement -

భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్నాడు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ను లంబూ డిసెంబర్ 9న పెళ్లాడబోతున్నాడు. జూన్ 19న వీళ్లిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. డిసెంబర్ 9న ఢిల్లీలోని హాటల్‌లో ఇషాంత్ శర్మ, ప్రతిమ సింగ్ వివాహ వేడుక జరుగనుంది. వారణాసికి చెందిన ప్రతిమా సింగ్ భారత బాస్కెట్ బాల్ టీంలో సభ్యురాలు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వ్యవహించింది. పెళ్లి రోజులు దగ్గర పడుతుండడంతో,,ఇప్పటి నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టారు. రీసెంట్‌గా ఇషాంత్ శర్మకు, తనకు కాబోయే భార్యకు వారణాసిలోని దశమ వేద ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇషాంత్‌ తన ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఫస్ట్ టైం తన సెకండ్ హోమ్‌ కు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

online news portal
చికన్ గున్యా కారణంగా న్యూజిలాండ్ తో జరిగే మూడో టెస్ట్ కు దూరమైన ఇషాంత్,,, కోలుకుని మళ్లీ ఇంగ్లాండ్‌ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టు లో చోటు సంపాందించుకున్నాడు. మొదటి, రెండు టెస్ట్ మ్యాచ్ లకు జరిగిన జట్టు ఎంపికలో,,,ఇషాంత్‌ కు చోటు దక్కింది. టీం ఇండియా టెస్ట్ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవడానికి,,,ఇషాంత్ కు ఇంగ్లాండ్ టెస్ట్‌ సిరీస్‌ ఓ మంచి తరుణం లాంటిది. అయితే టెస్ట్ సిరీస్‌ మధ్యలో ఇంషాత్ పెళ్లి ముహుర్తం ఉండడంతో,,,కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

- Advertisement -