వైభవ్ ఎంట్రీ ఖాయమేనా!

4
- Advertisement -

ఐర్లాండ్‌తో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టు తరఫున బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. అయితే కేవలం అతనిపై ఉన్న హైప్ ఆధారంగా కాకుండా జట్టు అవసరాలను బట్టే తుది నిర్ణయం ఉంటుందని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పష్టం చేశారు.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కితే భారత అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే (పురుషుల, మహిళల విభాగాల్లో) బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా అతను రికార్డు సృష్టిస్తాడు. ఐపీఎల్ మరియు ఇండియా-ఎ జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు జోఫ్రా ఆర్చర్ వంటి మేటి బౌలర్లను సైతం ఎదుర్కొని వైభవ్ తన అసాధారణ ప్రతిభను నిరూపించుకున్నాడని కోటక్ కొనియాడారు.

అయితే కేవలం ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటికే జట్టులో ఉంటూ పరుగులు సాధిస్తున్న ఆటగాడిని పక్కన పెట్టలేమని తుది జట్టుపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..హెడ్ కోచ్ నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. బిసిసిఐ (BCCI) అండర్-19 మరియు ఇండియా-ఏ వ్యవస్థల వల్ల ఆటగాళ్లు సీనియర్ జట్టు సంస్కృతికి సులభంగా అలవాటు పడుతున్నారని, వైభవ్ కూడా జట్టులో ఎంతో స్వేచ్ఛగా ఉంటూ ఆటను ఆస్వాదించేలా మేనేజ్‌మెంట్ మద్దతు ఇస్తోందని కోటక్ వెల్లడించారు.

Also Read:సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

- Advertisement -