జమిలీ ఎన్నికలు సాధ్యమేనా!

86
- Advertisement -

జమిలి ఎన్నికలు…ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి శాసనసభ, లోక్ సభ ఎన్నికలను నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ సర్కార్. అయితే ఇది అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి.

రాజ్యాంగంలో పార్లమెంట్ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 83, అలాగే రాష్ట్రపతి పాలనను సూచించే 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 172, 174 వంటి చట్టాలను సవరించాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే సాధ్యమయ్యే పనికాదు. జమిలి ఎన్నికలు నిర్వహించిన.. ఆ తరువాత ఏదో ఒక రాష్ట్రంలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాద్దైతే.. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది అతిపెద్ద సవాల్.

వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952,1957,1962,1967 వరకు లోక్ సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలీ ఎన్నికలు కనుమరుగైపోయాయి.

ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం ఓట్లతో అమోదించాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు అమోదముద్రవేయాలి. లోక్‌సభలో ఎన్డీయే బలం 61 %, రాజ్యసభలో 38 % బలం ఉంది. కానీ ఉభయసభల్లో 67 శాతం ఓట్లతో అమోదించాలి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. 16,బిల్లు ఆమోదానికి 14 రాష్ట్రాల అమోదం అవసరం. అయితే బీజేపీ మిత్ర పక్షాలు సైతం దీనిని అంగీకరించే పరిస్థితి లేదు. సో ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.. అయితే బీజేపీ మాత్రం ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా జమిలి ఎన్నికల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇది ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి..

Also Read:మళ్లీ నిరాశపర్చిన ప్రభాస్ ‘సలార్’!

- Advertisement -