పంజాబ్‌తో కోల్ కతా ఢీ.. ఎవరిది పైచేయ్!

29
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరగనుంది. ఈ రెండు జట్ల మద్య జరిగిన గత మ్యాచ్ లో కోల్ కతా పై పంజాబ్ విజయం సాధించింది. ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఐదు విజయాలను నమోదు చేసింది. ఇక కోల్ కతా 10 మ్యాచ్ లకు గాను నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కూడా తప్పనిసరిగా గెలవాల్సిన నేపథ్యంలో కోల్ కతా పంజాబ్ జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. కోల్ కతా లో బలమైన ప్లేయర్స్ ఉన్నప్పటికి.. వరుస వైఫల్యలు ఆ జట్టును కుదిపేస్తున్నాయి.

Also Read:Chalapathi Rao:ఇండస్ట్రీలో చెరగని ముద్ర

అయితే గత మ్యాచ్ లో హైదరబాద్ పై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న కోల్ కతా పంజాబ్ పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో ఓడిపోయిన పంజాబ్.. ఈ మ్యాచ్ తో ఎలాగైనా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తోంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ శికర్ ధావన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, దావన్ తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కూడా రెచ్చిపోతే పంజాబ్ కు తిరుగుండదు. ఇక కోల్ కతా విషయానికొస్తే.. కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్, రస్సెల్, వంటి హార్డ్ హిట్టర్స్ ఉన్నప్పటికి నిలకడ లేమి జట్టును కలవర పెడుతున్న అంశం. పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్ లో ఓటమి చవి చూసిన కోల్ కతా ఈ మ్యాచ్ తోనైనా దెబ్బకు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరి ఈ ఆసక్తికరమైన పోరు లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

Also Read:తలసేమియా డే:ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

- Advertisement -