క్వాలిఫయర్‌-2లో ముంబై గెలుపు

36
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో గెలుపొందింది.183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.3 ఓవర్లలో కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ బంతితో నిప్పులు చెరిగి 5 వికెట్లు తీసి లక్నో ఓటమిని శాసించాడు.

Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !

ఇక అంతకముందు టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమితో లక్నో జట్టు కథ ముగిసింది. మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో ముంబై తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు చెన్నైతో తలపడనుంది.

Also Read:పుష్ప2 రిలీజ్ ఎప్పుడంటే..?

- Advertisement -