కూలీగా మారిన చాహల్‌

386
- Advertisement -

న్యూజిలాండ్ సిరీస్‌లో ఉన్న భారత జట్టుకు ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. దీనిని భారత క్రికెట్ వన్డే కెప్టెన్‌ శిఖర్ ధావన్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అసలు ఏమైందంటే…యుజువేంద్ర చాహల్‌ మరియు అతన్ని భార్య అయిన ధనశ్రీ వర్మను ఆటపట్టించాడు. చూడండి యూసీని కూలీని చేసిన ధనశ్రీ అంటూ వీడియో తీశాడు.

యూసీ రెండు చేతులతో బ్యాగులతో పాటుగా మరోరెండు బ్యాగులను భుజాలపై వేసుకున్న విజువల్స్‌ను మరియు యూసీ భార్య ధనశ్రీ ఒక బ్యాగ్‌తో వస్తున్న విజువల్స్‌ను శిఖర్‌ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. పైగా యూసీ కూలీని చేసేసిందంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇప్పటికే ఒక వన్డే ఓడిపోయిన భారత జట్టు మూడో మ్యాచ్‌ కోసం సిద్దమైంది. అయితే రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఇది రికార్డు అంటే..ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు

పాక్‌కు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విరాళం….

నవశకానికి నాంది పలికిన రోజు:కేటీఆర్‌

- Advertisement -