‘ఆచార్య’ అసలు విషయం చెప్పిన మణిశర్మ

95
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి -మణిశర్మ కాంబో అంటే మెగా ఫ్యాన్స్ కి పండగే. చిరుకి ఓ దశలో బెస్ట్ సాంగ్స్ తో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మణి. కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ కాంబో ఆచార్య కోసం కలిశారు. అయితే ఈ సినిమాకు మణిశర్మ బెస్ట్ ఇవ్వలేదని మెగా ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ముఖ్యంగా సినిమాకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఆచార్య రిలీజ్ తర్వాత మణిశర్మ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక ఆచార్య రిజల్ట్ తర్వాత మణిశర్మ ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఆయన ఓ టివీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆలీ నేరుగా ఆచార్య నేపథ్య సంగీతం బాగాలేదనే కామెంట్స్ వచ్చాయి కదా అసలేమైంది ? అని అడిగేశాడు. దానికి మణిశర్మ కూడా ముక్కుసూటిగా నిజం చెప్పేశాడు. ఆచార్య లో రెండు సాంగ్స్ హిట్టయ్యాయి. అవేవారు మాట్లాడరు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే నేను ముందు వేరే స్కోర్ ఇచ్చారు. కానీ దర్శకుడు కొరటాల ఇంకో వర్షన్ కావాలని అడిగితే మళ్ళీ ట్రై చేశానని తెలిపాడు.

ఇక చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన తను ఎందుకు డిజప్పాయింట్ అయ్యే మ్యూజిక్ ఇస్తానని అన్నాడు. ఏదేమైనా తొలిసారి ఆచార్య మ్యూజిక్ గురించి మాట్లాడాడు మణిశర్మ. మరి మణి కామెంట్స్ వింటుంటే దర్శకుడు కొరటాల మ్యూజిక్ విషయంలో వేలు పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి…

చరణ్ తో మరో క్రేజీ డైరెక్టర్ ప్లానింగ్ !

బాలయ్య ‘షో’లో విజ్ఞానం.. దిగ్గజాలు రెడీ!

ఏడాదికో సినిమా… రాజమౌళి డిమాండ్

- Advertisement -