దేశంలో కొత్త‌గా 1,68,912 మందికి కరోనా

309
Covid-19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. వాటి ప్రకారం… గత 24గంటల్లో కొత్త‌గా 1,68,912 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 75,086 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 904 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,70,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,45,28,565 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -