దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 975..

90
India covid
- Advertisement -

భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 975 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుండి 796 మంది కోలుకోగా, నలుగురు మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 4,30,39,972 కేసులు నమోదయ్యాయి. 4,25,07,834 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 186.38 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగింది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రెండో దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. న్నిన్నటితో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య మరో 175 పెరగడం గమనార్హం.

- Advertisement -