‘సర్కారు వారి పాట’ థర్డ్ సింగిల్‌ వచ్చేస్తోంది..

109
Sarkaru Vaari Paata
- Advertisement -

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సంబధించిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు.

ఈమూవీ నుండి సూపర్‌ మాస్ బీట్ ఉన్న థర్డ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలిపారు. మొదటి పాటగా విడుదలైన ‘కళావతి’ మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె ప్రిన్సెస్ సితార ఘట్టమనేని ఫస్ట్ అప్పియరెన్స్‌తో వచ్చిన రెండో పాట ‘పెన్ని’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కు సన్నాహాలు చేస్తుంది. మిలిగిన ఒక పాటను త్వరలోనే చిత్రీకరించనున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్న ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు వుండటంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ముందుకొస్తున్నారు. జాతీయ అవార్డ్ విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -