దేశంలో 6 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు..

142
corona
- Advertisement -

భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. కొత్తగా 6,915 కేసులు న‌మోద‌య్యాయి.. అలాగే, 180 మంది క‌రోనాతో మరణించారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 16,864 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 4,23,24,550 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 92,472 మందికి చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 177.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామ‌ని ఆరోగ్య శాఖ పేర్కొంది.

- Advertisement -